'బడ్జెట్‌లో బీసీలకు ముష్టి రూ.6 వేల కోట్లా?'

by Disha Web Desk 2 |
బడ్జెట్‌లో బీసీలకు ముష్టి రూ.6 వేల కోట్లా?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర బడ్జెట్‌పై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. బీసీలకు కేటాయించిన నిధులపై ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ''ఓట్లు మావి, ఖజానా మీదా? దాదాపు రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు ఇచ్చింది ముష్టి రూ.6 వేల కోట్లా? బీసీలంటే ఇంత చులకనబావం ఎందుకు? పైగా ఈ దొంగలు రూ.6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టేదాక నమ్మకం లేదు. అందుకే బీసీ బిడ్డలారా, మన సంపద మనం గుంజుకుందాం రండి.'' అని సోషల్ మీడియా వేదికగా బీసీ యువతకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed